బీబీసీపై ఐటీ.. నెక్ట్స్ హిండెన్ బర్గ్‌పై ఈడీ: కేంద్రంపై KTR సెటైర్

by Disha Web Desk 19 |
బీబీసీపై ఐటీ.. నెక్ట్స్ హిండెన్ బర్గ్‌పై ఈడీ: కేంద్రంపై KTR సెటైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో దర్యాప్తు సంస్థ ఐటీశాఖ దాడులు నిర్వహించడంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బీబీసీ డాక్యుమెంటరీ ప్రసారం తర్వాత ఐటీ దాడులు జరుగుతున్నాయన్న ఆయన.. బీజేపీకి దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మలుగా మారడం నవ్వదగ్గ విషయమన్నారు. బీబీసీపై ఐటీ దాడుల తర్వాత.. హిండెన్‌బర్గ్‌పై ఈడీ దాడులా అంటూ విమర్శలు చేశారు.

ఈ మేరకు మంగళవారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు. 'ఏమి ఆశ్చర్యం!! బీబీసీ మోడీపై డాక్యుమెంటరీని ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత, బీబీసీ ఇండియాలో ఐటీ దాడులు చేస్తుంది. ఐటీ, సీబీఐ, ఈడీ వంటి ఏజెన్సీలు బీజేపీకి పెద్ద కీలుబొమ్మలుగా మారడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇక తర్వాత ఏంటి? హిండెన్‌బర్గ్‌పై ఈడీ దాడులా లేక శత్రు స్వాధీన ప్రయత్నమా? అంటూ మంత్రి కేటీఆర్ సెటైరికల్ ట్వీట్ చేశారు.



Next Story

Most Viewed