ద్వేషం, హింసకు ఇక్కడ చోటు లేదు: మంత్రి కేటీఆర్

by Disha Web Desk 12 |
ద్వేషం, హింసకు ఇక్కడ చోటు లేదు: మంత్రి కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : ద్వేషం, హింస, అర్ధంలేని మాటల‌కు హైదరాబాద్‌లో చోటు లేదని, లా అండ్ ఆర్డర్ కఠినంగా ఉంటుందని, విద్య, అకాడమిక్, ఇన్నోవేషన్, పర్యావరణ వ్యవస్థలు పకడ్బందీగా ఉన్నాయ‌ని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైద‌రాబాద్ సాలార్ పురియా సత్వా నాలెడ్జ్ సిటీలో మంగళవారం గ్లోబల్ ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ అసెట్స్ సర్వీస్ సిట్‌కో కొత్త యూనిట్‌ను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్‌ విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా ఉందన్నారు. దేశంలోని ప్రజలంతా తమ ఇంట్లో ఉన్నట్లు భావిస్తున్నారని, గత తొమ్మిదేళ్లలో సాంకేతిక రంగంలో ఉద్యోగుల సంఖ్య 3.25 లక్షల నుంచి 10 లక్షలకు పెరిగిందని పేర్కొన్నారు. ఇమేజ్ టవర్స్, యానిమేషన్, గేమింగ్, మల్టీమీడియా కోసం సిట్ కో కేంద్రాన్ని నిర్మించబడుతోంద‌ని పేర్కొన్నారు.

ఇది 18 ఎకరాల్లో విస్తరించి ఉండగా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అవుతుందని, దీనికి హైదరాబాద్‌ను ఎంపిక చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. సిట్‌కో మనీలాలో 3500 మంది ఉండగా, టొరంటో కేంద్రంలో 2500 మందే ఉన్నారని, హైదరాబాద్‌లో అమెజాన్ యొక్క అతిపెద్ద క్యాంపస్, మైక్రోసాఫ్ట్, మెటా, యాపిల్, గూగుల్, ఉబెర్, మైక్రోన్, క్వాల్‌కామ్ వంటి సంస్థల రెండవ అతిపెద్ద క్యాంపస్‌కు నిలయంగా హైదరాబాద్ మారింద‌న్నారు. ఈ కార్యక్రమంలో సిట్ కో ప్రతినిధి జై పెల్లర్, జీఎం అమిత్ వర్మ, జయేష్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed