రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ పాజిటివ్

by Disha Web Desk 2 |
రాష్ట్ర మంత్రి కొండా సురేఖకు డెంగ్యూ పాజిటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి కొండ సురేఖ అనారోగ్యం బారిన పడ్డారు. సోమవారం ఆమెకు డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారన అయింది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొంటున్న సమయంలో జ్వరం బారిన పడి, తన మంత్రిత్వశాఖల పరిధిలోని కార్యక్రమాలను ఇంటి నుంచే పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఐదు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో వైద్యులు పలు వైద్య పరీక్షలు చేసి డెంగ్యూ పాజిటివ్‌గా నిర్ధారించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని తన నివాసంలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారు. మేడారం జాతర, ప్రభుత్వ కార్యక్రమాలను మంత్రి పర్యవేక్షిస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో కోలుకొని, పునరుత్తేజంతో మేడారం సమ్మక్క సారక్క జాతరలో మంత్రిగారు పాల్గొంటారని తెలిపారు.



Next Story

Most Viewed