మేడారం జాతర అభివృద్ధి పనులపై సీఎం‌ను కలిసిన మంత్రి కొండా సురేఖ

by Disha Web Desk 12 |
మేడారం జాతర అభివృద్ధి పనులపై సీఎం‌ను కలిసిన మంత్రి కొండా సురేఖ
X

దిశ, వెబ్‌డెస్క్: దేవాదాయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డిని కలిశారు. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అభివృద్ధి పనుల గురించి చర్చించారు. 2024 సంవత్సరంలో జరిగే తెలంగాణ కుంభమేళా(మేడారం జాతర) మౌలిక సదుపాయాల కల్పన, యాత్రికుల కోసం షాపింగ్ కాంప్లెక్స్, విశ్రాంతి గదులు, తాగునీటి నిర్మాణాలు, మండపం వంటి శాశ్వత సౌకర్యాలను ఏర్పాటు చేయడం కోసం నిధులు మంజూరు చేయాలని, పనులు చేపట్టేందుకు బడ్జెట్ మంజూరు కోసం శాఖల వారీగా ప్రతిపాదించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఆమె కోరారు.

Read More..

BREAKING: స్పీకర్ పోస్టుకు గడ్డం ప్రసాద్ నామినేషన్.. మద్దతు తెలిపిన BRS



Next Story

Most Viewed