అనర్హత వేటు పడుతుందనే అసెంబ్లీకి కేసీఆర్​ : మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్​

by Muthe.Rajitha |

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనర్హత వేటు పడుతుందనే అసెంబ్లీకి కేసీఆర్​ : మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్​
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనర్హత వేటు పడుతుందనే ప్రతిపక్షనేత కేసీఆర్​​ నేటి అసెంబ్లీ సమావేశాలకు రావాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. మంగళవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కింజరపు రామ్మోహన్​లను కలిసిన అనంతరం కోమటిరెడ్డి ఈ మేరకు మీడియాతో చిట్​చాట్​ చేశారు. కేసీఆర్​, కేటీఆర్​, హరీష్​రావు, కవితలు కులగణనలో పాల్గొన లేదన్నారు. బీఆర్​ఎస్​కు అసలు బీసీ కులగణనపై మాట్లాడే హక్కే లేదన్నారు. కేసీఆర్​​ తెచ్చిన అప్పులకు తాము వడ్డీలు కడుతున్నామన్నారు. కొండగట్టు బస్సు ప్రమాదం జరిగి ప్రజలు చనిపోతే స్పందించని కేసీఆర్​ ఆయన ఇంట్లో కుక్క చనిపోతే డాక్టర్​ను సస్పెండ్​ చేశారని ఎద్దేవా చేశారు. మాసాయిపేట ప్రమాదంలో చిన్న పిల్లలు చనిపోతే కేసిఆర్​వె ళ్లలేదన్నారు. తెలంగాణ కోసం కేసిఆర్​ దొంగ దీక్షలు చేశారన్నారు. ఇటీవల జరిగిన కేబినెట్ ​భేటీకి ఎలాంటి గొడవలు జరగలేదన్నారు. రేవంత్​ రెడ్డినే పదేళ్లు సీఎంగా ఉంటారన్నారు. సీఎం మార్పు అనేది కేవలం ప్రచారమే తప్ప వాస్తవం కాదన్నారు.

Next Story