- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు.. అధికారులపై మంత్రి కోమటిరెడ్డి సీరియస్
by Gantepaka Srikanth |
హైదరాబాద్లోని ఉప్పల్ ఏరియాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఎలివేటెడ్ కారిడార్ పనులను కోమటిరెడ్డి పరిశీలించారు.

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్లోని ఉప్పల్ ఏరియాలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పర్యటించారు. స్థానిక ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితో కలిసి ఎలివేటెడ్ కారిడార్ పనులను కోమటిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులపై మంత్రి సీరియస్ అయ్యారు. కేవలం నిర్లక్ష్యం కారణంగానే పనులు పూర్తి కాలేదని అన్నారు. 15 రోజుల్లో కల్వర్లు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. కాంట్రాక్టర్ల మీద పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని వార్నింగ్ ఇచ్చారు. 2018 నుంచి పనులు పూర్తి కాకపోవడం గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి అవమానకరం అన్నారు. వర్షాకాలంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. తక్షణమే రోడ్ల మరమత్తులపై కూడా నివేదిక అందజేయాలని సంబంధిత శాఖా అధికారులను ఆదేశించారు. 7వ తేదీ నుంచి పనులు ప్రారంభిస్తామని ఆర్వో పుష్ప మంత్రికి వివరించారు.
Next Story






