రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహం.. ఏర్పాట్లపై మంత్రి సమీక్ష

by Ramesh Naini |   (  Updated:2025-11-27 15:13:48  IST  )

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.

రవీంద్రభారతి ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహం.. ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
X

దిశ, రవీంద్ర భారతి/ దిశ, డైనమిక్ బ్యూరో: గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (SP Balasubrahmanyam) విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి ఆవరణలో SPB కాంస్య విగ్రహ ప్రతిష్టకు ప్రభుత్వం స్పీడప్ చేసింది. సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతి ప్రాంగణంలో ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పక్కన ఎస్పీ బాలు విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు గురువారం విగ్రహ ఏర్పాట్లను మంత్రి జూపల్లి కృష్ణారావు, నటుడు శుభలేఖ సుధాకర్ పరిశీలించారు. అనతరం విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు, సాంస్కృతిక శాఖ అధికారులతో మంత్రి జూపల్లి కృష్ణారావు సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కవి యాకూబ్, బడేసాబ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story