శివరాత్రి పర్వదినాన మంత్రి హరీశ్ రావు కీలక హామీ

by Disha Web Desk 2 |
శివరాత్రి పర్వదినాన మంత్రి హరీశ్ రావు కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: మెదక్ జిల్లా ఏడుపాయల దుర్గమ్మ ఆలయంలో జరుగుతున్న మహా శివరాత్రి వేడుకల్లో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గమ్మతల్లికి హరీశ్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు హరీశ్ రావు మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలోని దేవాలయాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని అన్నారు. ఏడుపాయల ఆలయానికి ప్రతి ఏటా నిధులు కేటాయిస్తున్నట్లు గుర్తుచేశారు. అంతేగాకుండా.. ఏడుపాయల ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.



Next Story