వర్షాల ఎఫెక్ట్: రాష్ట్ర రైతాంగానికి మంత్రి గంగుల కీలక సూచన

by Disha Web Desk 2 |
వర్షాల ఎఫెక్ట్: రాష్ట్ర రైతాంగానికి మంత్రి గంగుల కీలక సూచన
X

దిశ, వెబ్‌డెస్క్: అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన ధాన్యం తడిసి రైతులు కంటనీరు పెట్టే పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర రైతులకు మంత్రి గంగుల కమలాకర్ కీలక సూచనలు చేశారు. వరిధాన్యం తేమశాతం 17లోపు ఉంటేనే కొనుగోలు చేస్తామని అన్నారు. ఎఫ్‌సీఐ విధానాల ప్రకారమే కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. 20 శాతం తేమ ఉన్నా కొనుగోలు చేయాలని ఎఫ్‌సీఐని కోరినట్లు తెలిపారు. రైతులంతా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు. కేంద్ర ఫసల్ బీమాతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం తప్పక ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.



Next Story

Most Viewed