1200 మంది చనిపోవడానికి కాంగ్రెసే కారణం: మంత్రి ఎర్రబెల్లి ఫైర్

by Disha Web Desk 19 |
1200 మంది చనిపోవడానికి కాంగ్రెసే కారణం: మంత్రి ఎర్రబెల్లి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్‌పై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శలు గుప్పించారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా తొర్రూర్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి ఎర్రబెల్లి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం 1200 మంది చనిపోవడానికి అనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఆరోపించారు. అనాడే తెలంగాణ ఇస్తే ఇన్ని మరణాలు సంభవించేవి కావని.. వందల మంది విద్యార్థుల ప్రాణాలు పోయేవి కావని కీలక వ్యాఖ్యలు చేశారు.

అలాంటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తే అమరవీరుల కుటుంబాలకు రూ.25 వేల పెన్షన్ ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో పాలన సరిగ్గా చేయాలని సూచించారు. ఇక, మే 8వ తేదీన టీ కాంగ్రెస్ తలపెట్టిన యువ సంఘర్షణ సభలో యూత్ డెక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డిక్లరేషన్ లోనే తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు నెల 25 వేల పెన్షన్ ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది.



Next Story

Most Viewed