- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిరోజ్ ఖాన్ను అడ్డుకున్న ఎంఐఎం నేతలు.. నాంపల్లిలో ఉద్రిక్తత
by GSrikanth |
హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. బజార్ఘాట్లోని కెమికల్ గోడౌన్లో మంటలు చెలరేగి.. ఆ మంటల్లో చిక్కుకొని తొమ్మిది మరణించారు.

X
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే. బజార్ఘాట్లోని కెమికల్ గోడౌన్లో మంటలు చెలరేగి.. ఆ మంటల్లో చిక్కుకొని తొమ్మిది మరణించారు. ఈ ఘటనపై ఇప్పటికే గవర్నర్ తమిళి సై, సీఎం కేసీఆర్ స్పందించి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాజాగా.. ఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు కాంగ్రెస్ నేత ఫిరోజ్ ఖాన్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన్ను స్థానిక ఎమ్ఐఎమ్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రెండు గ్రూపుల మధ్య తోపులాట జరిగింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు స్వల్ప లాఠీఛార్జీ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
Next Story






