టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో అలంపూర్ ముఖ్య నాయకుల సమావేశం..

by Disha Web Desk 11 |
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో అలంపూర్ ముఖ్య నాయకుల సమావేశం..
X

దిశ, ఉండవల్లి: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తలపెట్టిన రెండో విడత హాథ్ సే హాథ్ జోడో పాదయాత్ర మే 9వ తేదీ నుంచి జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లోని జోగులాంబ అమ్మవారి సన్నిధి నుంచి ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్ లోని రేవంత్ రెడ్డి తన నివాసంలో ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ నేతృత్వంలో అలంపూర్ ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు.

యాత్రను విజయవంతం చేసేందుకు రూట్ మ్యాప్ తదితర అంశాలపై స్థానిక నాయకులతో కలిసి చర్చించారు. అందరు కలిసి కట్టుగా యాత్రను విజయవంతం చేయాలని అందుకు కార్యకర్తలను సన్నద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో అలంపూర్ కాంగ్రెస్ ఆయా మండలాల అధ్యక్షులు ఎర్రవల్లి సర్పంచ్ జోగుల రవి, మాస్టర్ షేక్షవలి ఆచారి, గోపాల్, జగన్మోహన్ నాయుడు, అడ్డాకుల రాము తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed