మధుయాష్కీ నివాసంలో మాజీ ఎంపీల భేటీ.. టీ- కాంగ్రెస్‌లో హాట్ టాపిక్..!

by Disha Web Desk 19 |
మధుయాష్కీ నివాసంలో మాజీ ఎంపీల భేటీ.. టీ- కాంగ్రెస్‌లో హాట్ టాపిక్..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీకాంగ్రెస్‌లో మాజీ ఎంపీల సమావేశం ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్ నివాసంలో సోమవారం మాజీ ఎంపీలు సురేష్ షట్కర్, బలరాం నాయక్, రాజయ్య తదితరులు భేటీ అయ్యారు. పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో వీరి పేర్లు లేవు. కాగా మధుయాష్కీ ఎల్బీ నగర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా, సురేష్ షెట్కర్ నారాయణఖేడ్ టికెట్ ఆశిస్తున్నారు. బలరాం నాయక్ మహబూబాబాద్ బరిలో నిలవాలని చూస్తున్నారు. అయితే పార్టీ ప్రకటించిన తొలి జాబితాలో వీరు ఆశిస్తున్న స్థానాలకు అభ్యర్థులను అధిష్టానం ఇంకా ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తిగా మారింది.



Next Story