కుత్బుల్లాపూర్ అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

by Disha Web Desk 11 |
కుత్బుల్లాపూర్ అభివృద్ధికి కృషి: ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
X

దిశ, కుత్భుల్లాపూర్: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం అభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తానని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని వెన్నెల గడ్డ, బౌద్ధ నగర్ లలో ప్రగతి యాత్రలో భాగంగా 68వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తూ పూర్తిచేసిన పలు అభివృద్ధి పనులు పరిశీలించారు. కాగా తమ బస్తీలు, కాలనీలో మెరుగైన సౌకర్యాల కల్పనకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించినందుకు ఎమ్మెల్యేకి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని, అక్కడక్కడా మిగిలి ఉన్న భూగర్భడ్రైనేజీ, సీసీ రోడ్ల ఏర్పాటు, పార్క్ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యేని కోరారు. వెంటనే సంబంధిత అధికారులకు ఆయా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. త్వరలోనే వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంపత్ మాధవరెడ్డి, కుంట సిద్ధిరాములు, గుమ్మడి మధుసుధన్ రాజు, జ్ఞానేశ్వర్, వార్డు సభ్యులు సుధాకర్ గౌడ్, ఇందిరా రెడ్డి, కాలే నాగేష్, సమ్మయ్య, బాలమల్లేష్, భిక్షపతి, రవి, యాదగిరి, సుబ్బారావు, మధుకృష్ణ, ముత్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed