- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
హానర్ నిర్మాణ సంస్థ నిర్లక్ష్యానికి కార్మికులు బలి..
దిశ,కూకట్పల్లి : కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని హానర్ అనే బడా నిర్మాణ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఇద్దరు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కనీస జాగ్రత్తలు పాటించకుండా బ్లాస్టింగ్ చేయడంతో అక్కడే పనిచేస్తున్న ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న మీడియా అక్కడికి చేరుకుని కవరేజ్ చేసేందుకు ప్రయత్నించగా నిర్మాణ సంస్థ ప్రతినిధులు మీడియాను లోపలికి అనుమతించలేదు. ఐడీఎపీఎల్ రంగధాముని చెరువు రోడ్డులో 27 ఎకరాల స్థలంలో హానర్ అనే బడా నిర్మాణ సంస్థ జి ప్లస్ 25 బహుళ అంతస్తు నిర్మాణాలను చేపడుతుంది. వీటిని కే ఎల్సి కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్మాణ పనులు చేపడుతుండగా, పటేల్ మైనింగ్ సంస్థ రాళ్లను బ్లాస్టింగ్ పనులను చేపడుతుంది.
శుక్రవారం నిర్మాణ పనులలో భాగంగా పెద్ద పెద్ద బండరాళ్లను పగలగొట్టడానికి పటేల్ మైనింగ్ సంస్థ ప్రయత్నించింది. అదే సమయంలో అక్కడే పనిచేస్తున్న వెస్ట్ బెంగాల్కు చెందిన హరిలాల్ మహాంతో(54), బిహార్కు చెందిన పంకజ్ ఆలమ్(32)లు తీవ్ర గాయాల పాలయ్యారు. హుటాహుటిన నిర్మాణ సంస్థ ప్రతినిధులు వారిద్దరిని సమీపంలో అమోర్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఇద్దరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటన సమాచారం అందుకున్న కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాస్ రావు, సీఐ కృష్ణ మోహన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ సంఘటన వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని, నిర్మాణ సంస్థకు ఉన్న అనుమతులు, మైనింగ్, బ్లాస్టింగ్ అనుమతులపై విచారణ చేపట్టి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు.