రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి

by Disha Web Desk 15 |
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
X

దిశ, బాన్సువాడ : బాన్సువాడ పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు బాన్సువాడ పట్టణ సీఐ మున్నూరు కృష్ణ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నస్రుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామానికి చెందిన సాయి కుమార్ అదేవిధంగా బీర్కూర్ మండలం చించోలి గ్రామానికి చెందిన మారుతి అనే ఇద్దరు వ్యక్తులు బాన్సువాడకు వచ్చి తిగిగి వెళ్తుండగా బాన్సువాడ పట్టణంలోని బస్ డిపో సమీపంలో

ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది. దాంతో వారు కిందపడిపోయారు. అదే సమయంలో దాని వెనుకాలే వస్తున్న లారీ బాధితుల కాళ్లపై నుండి వెళ్లగా చించోలి గ్రామానికి చెందిన మారుతిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మృతి చెందాడు. అలాగే నాచుపల్లికి చెందిన సాయి కుమార్ నిజామాబాద్ లో చికిత్స పొందుతున్నాడని, అతని పరిస్థితి కూడా సీరియస్ గా ఉన్నట్లు సీఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.



Next Story