ప్రభుత్వం కల్పించిన జీఓ 58,59 ను సద్వినియోగం చేసుకోండి : మేడిపల్లి తహసీల్దార్

by Dishaweb |
ప్రభుత్వం కల్పించిన జీఓ 58,59 ను సద్వినియోగం చేసుకోండి : మేడిపల్లి తహసీల్దార్
X

దిశ, మేడిపల్లి: గడువులోపు డబ్బులు చెల్లించి వెంటనే మీ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసుకుని క్రమబద్దీ కరించుకోవాలని మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండల తహసీల్దార్ హసీనా అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిఓ 58, 59 ప్రకారం ప్రభుత్వ భూమిలో ఇండ్లు కట్టుకున్న వారి ఇండ్లు ప్రభుత్వం క్రమబద్దికరిస్తామని చెప్పడంతో వేల మంది దరఖాస్తు చేసుకున్నారని అందులో జీఓ 58 ప్రకారం చాలా మంది తమ ఇండ్లను క్రమ బద్ధికరించుకున్నారని, జీఓ 59 ప్రకారం అర్హులకు నోటీసులు అందించమని, గడువులోపు మూడు విడతలలో డబ్బు చెల్లిస్తే వారం రోజులలోనే వారి ఇల్లు క్రమ బద్ధికరించి రిజిస్ట్రేషన్ చేయిస్తామని అన్నారు.గడువు దాటితే అట్టి నిర్మాణాన్ని కూల్చి వేస్తామని నోటీసులు అందిన వాళ్ళు డబ్బు చెల్లించి తమ ఇల్లు క్రమ బద్ధికరించుకోవాలని తహసీల్దార్ హసీనా విజ్ఞప్తి చేశారు.



Next Story

Most Viewed