తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహా నాయకుడు ఎన్టీఆర్..

by Disha Web Desk 11 |
తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహా నాయకుడు ఎన్టీఆర్..
X

దిశ, కూకట్ పల్లి: తెలుగుజాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన మహా నాయకుడు ఎన్టీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ నామా నాగేశ్వరరావు లు అన్నారు. కూకట్ పల్లి నియోజక వర్గం కేపిహెచ్ బీ డివిజన్ వసంత్ నగర్ కాలనీలో ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, అరికేపూడి గాంధీ, కార్పొరేటర్ మందాడి శ్రీనివాస్ రావులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపి నామా నాగేశ్వరరావులు మాట్లాడుతూ తెలుగు భాష ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది ఎన్టీఆర్ కృషితోనే అని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రోజా దేవి, మాజీ కార్పొరేటర్ మహావరం రంగారావు తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed