- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లంచాలు డిమాండ్ చేయడంలో కూకట్ పల్లి జోన్ టాప్
కూకట్పల్లి జోన్ ప్రతి సారి ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడిన కూకట్పల్లి జోన్ ఎల్లప్పుడు అవినీతి అధికారుల ద్వారా వార్తలలోకి ఎక్కుతూనే ఉంటుంది.

దిశ, కూకట్పల్లి : కూకట్పల్లి జోన్ ప్రతి సారి ఏదో రకంగా వార్తల్లో నిలుస్తుంటుంది. ముఖ్యంగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పడిన కూకట్పల్లి జోన్ ఎల్లప్పుడు అవినీతి అధికారుల ద్వారా వార్తలలోకి ఎక్కుతూనే ఉంటుంది. దొరికితే దొంగలం, దొరకనంత వరకు దొరలమే కదా అన్న సిద్దాంతాన్ని పాటిస్తన్నట్టు ఉన్నారు కూకట్పల్లి జోన్లోని ఆయా సర్కిళ్ల అధికారులు. గత 6 నెలల కాలంలోనే అవినీతి నిరోధక శాఖ అధికారుల బాధితుల నుంచి డబ్బులు లంచంగా తీసుకుంటుండగా ముగ్గురినీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వరుసగా ఏసీబీ అధికారుల దాడులు జరుగుతున్నా.. అధికారులకు కనీసం చీమ కుట్టునట్టు కూడా లేదు. ఎంతో కాలంగా పాతుకు పోయి ఒకే స్థానంలో పని చేస్తూ స్థాన చలనం లేక పోతుండటంతోనే ఏ స్థాయి పైరవీలకైనా సిబ్బంది, అధికారులు యధేచ్చగా తమ జేబులను నింపుకునేందుకు సిద్దంగా ఉంటున్నారు.
సర్కిల్ స్థాయి నుంచి జోనల్ స్థాయి వరకు ఎటువంటి పని ఉన్న సరే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే చక్క బెడుతారనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. కూకట్పల్లి జోన్ పరిధిలో ప్రధానంగా ఉన్న కూకట్పల్లి, మూసాపేట్ సర్కిళ్ల పరిధిలో అన్ని విభాగాలలో పని చేస్తున్న అటెండర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, డ్రైవర్లు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, పారిశుధ్య విభాగం, ఎంటమాలజి, రెవెన్యు, యూసీడి విభాగాలలో పని చేస్తున్న ఉద్యోగులు, అధికారులు గత రెండు దశాబ్దాలుగా ఇదే ప్రాంతంలో, ఇవే సర్కిళ్లలో పని చేస్తున్నారు. కూకట్పల్లి, మూసాపేట్ సర్కిళ్లతో పాటు జోనల్ కమీషనర్ కార్యాలయం సైతం ఒకే భవనంలో కొనసాగుతుంది. దశాబ్దాలుగా ఒకే స్థానంల, ఒకే ప్రాంతంలో పని చేస్తుండటంతో రెండు సర్కిళ్లతో పాటు, జోనల్ కార్యాలయంలో అన్ని పనులలో పైరవీలు చేస్తూ సిబ్బంది, అధికారులు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఏళ్లుగా ఒకే చోట పాతి పెట్టుకుని ఉన్న అధికారులు, సిబ్బందికి స్థానచలనం చేసే వరకు కూకట్పల్లి జోన్లో అవినీతి కంపు పోదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
గత నెల రోజుల క్రితం ఫిబ్రవరి నెలలో కుత్బుల్లాపూర్ సర్కిల్లో రెవెన్యూ ఇన్ స్పెక్టర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు పట్టు బడ్డాడు. ఏసీబీ సోదాల్లో కూకట్పల్లి సర్కిల్ పరిధిలో జరగుతాయనే రూమర్స్ రావడంతో సర్కిల్లో టౌన్ ప్లానింగ్ విభాగంలో పని చేస్తున్న ఓ ఉన్నతాధికారి రెండు రోజలు అకస్మాత్తుగా సెలవు పెట్టి విధులకు హాజరు కాకుండా వెళ్లినట్టు సమాచారం. కూకట్పల్లి, మూసాపేట్ సర్కిళ్ల పరిధిలోని టౌన్ప్లానింగ్, ఇంజనీరింగ్, రెవెన్యూ విభాగాలలో ఎక్కువ శాతం అవినీతి జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. కూకట్పల్లి జోన్ పరిధిలోని కూకట్పల్లి, మూసాపేట్ జంట సర్కిళ్లతో పాటు గతంలో విభజనకు ముందు ఉన్న కుత్బుల్లాపూర్, అల్వాల్, గాజులరామారం సర్కిళ్లతో కూడిన జోన్ ఉన్న సమయంలోనే ఏసీబి అధికారులకు పట్టు బడిన కేసులు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఓ స్వచ్చ ఆటో కార్మికుడి నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేస్తూ ఓ ఎస్ఆర్పి ఏసీబి అధికారులకు పట్టు బడ్డాడు. టౌన్ ప్లానింగ్ విభాగంలోను పలువురు లంచం తీసుకుంటుండగా.. పట్టు బడిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా గత ఆరు నెలల కాలంలో జరిగిన మూడు సంఘటనలు జరిగాయి.
♦ మార్చి 10, 2026 తాజాగా కూకట్పల్లి జోన్ పరిధిలోని మూసాపేట్ సర్కిల్ మూసాపేట్ డివిజన్ కమ్యునిటి ఆర్గనైజర్గా పని చేస్తున్న మురళి పొదుపు సంఘాల మహిళలకు లోన్ ఇప్పించడానికి వారి నుంచి 18 వేలు లంచం డిమాండ్ చేసి డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
♦ ఫిబ్రవరి 4, 2026న కూకట్పల్లి జోన్లో ఏస్ఈగా పని చేస్తున్న చెన్నారెడ్డి ఓ కాంట్రాక్టర్ వద్ద నుంచి 1.40 కోట్ల బిల్లులు విడుదల చేయాలంటే రూ.30 లక్షలు లంచం డిమాండ్ చేసి రూ.15 లక్షలు నగదు కంప్యూటర్ ఆపరేట్ ప్రవీణ్ ద్వారా తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
♦ జులై 1, 2025 న మూసాపేట్ సర్కిల్ రెవెన్యూ విభాగంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న సునిత ఓ వ్యక్తి నుంచి మ్యూటేషన్ చేయడానికి రూ.80 వేలు లంచం డిమాండ్ చేసి రూ.30 వేల రూపాయలు నగదు తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇలా నిత్యం కూకట్ పల్లి జోన్ లో ఏబీసీ అధికారులకు పట్టుబడటం సంచలనంగా మారింది.






