ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా చూపించారు

by Disha Web Desk 1 |
ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా చూపించారు
X

సీపీఎం నాయకులపై బీజేపీ ఆరోపణలు

దిశ, కుత్బుల్లాపూర్: సీపీఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులుకు ప్రభుత్వ భూమిని ప్రగతి నగర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు, నాయకులు రిజిస్ట్రేషన్ చేశారని స్థానిక బీజేపీ నాయకులు ఆరోపించారు. సర్వే నెం.186లో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని, సర్వే నెం.182 వాసవి లే అవుట్ లో పట్టా భూమిగా సుమారు 1600 గజాలు స్థలాన్ని ఆక్రమించారని తెలపారు. తప్పడు పత్రాలను సృష్టించింది నిజాంపేట్ కు చెందిన ఓ నాయకుడని తెలిపారు. సదరు స్థలానికి హెచ్ఎండీఏ అనుమతులు కూడా ఇవ్వడం విడ్డూరంగా ఉందని, దీనిపై ఎమ్మార్వో కార్యాలయంలో ప్రభుత్వ భూమి సర్వే నెం.186లో కబ్జాపై సమగ్ర సర్వే చేసి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని బీజేపీ నిజాంపేట్ అధ్యక్షుడు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

Next Story

Most Viewed