కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ మృతి..

by Disha Web Desk 20 |
కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు ప్రభాకర్ మృతి..
X

దిశ, కంటోన్మెంట్/ బోయిన్ పల్లి : తెలంగాణలో చురుకైన పాత్ర పోషించి, కంటోన్మెంట్ బోర్డ్ మాజీ సభ్యునిగా అందరితో కలిసి మెలిసి తిరిగే నాయకుడు ప్రభాకర్ ఇక లేరు అనే వార్త కంటోన్మెంట్ ప్రజలను కలిచివేసింది. ఒక్క సారిగా బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అవడంతో ఐదు రోజుల నుండి ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరకు శుక్రవారం మధ్యాహ్నం తుది శ్వాస విడిచాడు. కంటోన్మెంట్ బలం రాయ్ లోని నివాసం వద్దకు పార్థీవ దేహాన్ని తరలించారు.

కంటోన్మెంట్ లోని అన్ని ప్రాంతాల నుండి చివరిసారి అతన్ని చూసేందుకు జనాలు అక్కడికి చేరుకుని ఆయనకు నివాళులు అర్పించారు. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇంటికి చేరుకుని వారి ప్రగాఢ సానుభూతి తెలిపి, కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని నింపారు. నివాళులు అర్పించిన వారిలో జంపన ప్రతాప్, మర్రి రాజశేఖర్ రెడ్డి, గజ్జెల నాగేష్, క్రిశాంక్, పాండు యాదవ్, జక్కుల, లోక్ నాథం, నళిని కిరణ్, సదా కేశవ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఉన్నారు.

Next Story

Most Viewed