అమెరికాలో కుటుంబం..5 తులాల బంగారం, కిలో వెండి అపహరణ

by velandi.Saikiran |   (  Updated:2026-03-23 19:45:59  IST  )

మేడిపల్లి పరిధి ఎంఐఎం కాలనీలో దొంగ‌త‌నం జ‌రిగింది.అమెరికాలో కుటుంబం ఉన్న త‌రుణంలో ఆ ఇంట్లో దొంగ‌లు ప‌డ్డారు.

అమెరికాలో కుటుంబం..5 తులాల బంగారం, కిలో వెండి అపహరణ
X

దిశ, మేడిపల్లి : మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి ఎంఐఎం కాలనీలో భారీ దొంగ‌త‌నం జ‌రిగింది. ‎నాలుగు నెలలుగా అమెరికాలో కుటుంబం ఉన్న త‌రుణంలో ఆ ఇంట్లో దొంగ‌లు ప‌డ్డారు. ఈ సంఘట‌న వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఎంఐఎం కాలనీకి చెందిన ఎన్. పద్మనాభ శర్మ దంప‌తులు ఇద్ద‌రు 4 నెలల క్రితం అమెరికాలో నివాసం ఉండే తమ కూతురు వద్దకు వెళ్లారు. అప్పటి నుంచి ఆ ఇంటికి తాళం వేసి ఉంది.

ఇది గమనించిన దుండగులు, సోమవారం ఉదయం ఇంట్లోకి ప్రవేశించి నగదును అపహరించారు. అయితే, ఆ ఇంటి నుంచి శబ్దాలు వ‌చ్చాయి. ఇది గమనించిన పక్కింటి బీఎస్ఎన్ఎల్ ఉద్యోగి విగ్నేశ్వర్ గట్టిగా అరవడంతో గోడ దూకి పారిపోయారు దొంగ‌లు. ఇట్టి విషయంపై వ్యక్తి మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాగా ఈ సంఘ‌ట‌న‌లో ఎన్. పద్మనాభ శర్మ ఇంట్లో 5 తులాల బంగారం, కేజీ వెండి వస్తువులు దొంగ‌తనం జ‌రిగింది. దీనిపై కేసు నమోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

Next Story