బీజేపీ నుంచి ఈటల రాజేందర్,ఈటల జమునలు నామినేషన్ దాఖలు

by Disha Web Desk 23 |
బీజేపీ నుంచి ఈటల రాజేందర్,ఈటల జమునలు నామినేషన్ దాఖలు
X

దిశ,మేడ్చల్ బ్యూరో : మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి తొలి రోజు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం బీజేపీ అభ్యర్థులుగా ఈటల రాజేందర్, ఆయన సతీమణి ఈటల జమునలు నామినేషన్లు దాఖలు చేశారు. వీరితోపాటు అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ అభ్యర్థిగా మేడే సత్యం, స్వాతంత్ర్య అభ్యర్థులుగా పాలది పవన్ కుమార్, బేగరి లోకేష్, చిలకా చంద్రశేఖర్, మలోతు శంకర్,పెసరి కాయల పరీక్షిత్తు రెడ్డిలు నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎన్నికల అధికారి గౌతమ్ పోట్రు తెలిపారు. అయితే వీరిలో పెసరికాయల పరీక్షిత్తు రెడ్డి రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేయడంతో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి మొదటి రోజు 8 మంది తొమ్మిది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

Next Story

Most Viewed