- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూకట్పల్లిలో అభివృద్ధి : టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూకట్పల్లి నియోజకవర్గం సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ అన్నారు.

దిశ, కూకట్పల్లి : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూకట్పల్లి నియోజకవర్గం సమస్యలను పరిష్కరించేందుకు, అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గం కేపీహెచ్బీ డివిజన్ పరిధిలోని గోపాల్ నగర్ కాలనీలో ఆదివారం స్థానిక సమస్యల పై బండి రమేష్ పాదయాత్ర నిర్వహించారు. కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించి స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాలనీలో ఉన్న చాలా పార్కులు కబ్జాకు గురయ్యాయని కాలనీ వాసులు బండి రమేష్ దృష్టికి తీసుకు వచ్చారు. దీంతో బండి రమేష్ పార్కుల కబ్జా విషయంలో హైడ్రా సీఐ రమేష్తో మాట్లాడి పార్కుల కబ్జా విషయం పై చర్యలు తీసుకోవలని సూచించారు.
గోపాల్ నగర్ లేఔట్లోని పార్కు స్థలాలను గుర్తించి వాటిలోని ఆక్రమణలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటామని బండి రమేష్ హామీ ఇచ్చారు. గోపాల్ నగర్లో కొన్ని వీధులలో రోడ్లు, వీధి దీపాల సమస్య ఉందని కాలనీ వాసులు బండి రమేష్ దృష్టికి తీసుకు వచ్చారు. కాలనీలో సమస్యలను ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్, రంగమోహన్ తదితరులు పాల్గొన్నారు.






