- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోమల నివారణకు పటిష్టమైన చర్యలు: డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరులు
by Kodari Anjali |
రానున్న వర్షాకాలంలో దోమల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరులు అన్నారు.

X
దిశ, అల్వాల్: రానున్న వర్షాకాలంలో దోమల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని అల్వాల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ భోగేశ్వరులు అన్నారు. గురువారం సర్కిల్కు కేటాయించిన రెండు నూతన ప్యాకింగ్ మిషన్లకు జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే సర్కిల్కు రెండు మిషన్లు ఉండగా అదనంగా మరో రెండు రావడంతో మొత్తం నాలుగు మిషన్లు అయినట్లు తెలిపారు. వీటి ద్వారా సర్కిల్ వ్యాప్తంగా దోమల నివారణ చర్యలు వేగవంతం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ ఏఈ , వార్డు సూపర్వైజర్లు పాల్గొన్నారు.
Next Story






