- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేఎఫ్సీలో కుళ్లిపోయిన చికెన్ అంటూ కస్టమర్ గొడవ
by Jakkula.Mamatha |
కూకట్పల్లి అశోక వన్ మాల్లోని కేఎఫ్సి ఔట్లెట్లో కుళ్లిపోయిన చికెన్ కలకలం రేపింది.

X
దిశ, కూకట్పల్లి: కూకట్పల్లి అశోక వన్ మాల్లోని కేఎఫ్సి ఔట్లెట్లో కుళ్లిపోయిన చికెన్ కలకలం రేపింది. శనివారం స్నేహితులతో కలిసి వచ్చిన కస్టమర్ సహిర్ చికెన్ బకెట్, బర్గర్లను ఆర్డర్ చేశాడు. తినడానికి ప్రయత్నించిన కస్టమర్ కుళ్లిపోయిన వాసన రావడంతో కేఎఫ్సి నిర్వాహకులను నిలదీశాడు. తప్పు జరిగింది అంటూ కస్టమర్కు చెల్లించిన మొత్తాన్ని రిటర్న్ చేశారు. చిన్న పిల్లలు కుళ్లి పోయిన పదార్థం తిని రోగాల బారిన పడితే ఎవరు బాధ్యులు అంటు కస్టమర్తో పాటు అక్కడే ఉన్న మరి కొంత మంది కేఎఫ్సి ఔట్లెట్ నిర్వాహకులను ప్రశ్నించారు. మున్సిపల్ అధికారులు, ప్రభుత్వం కుళ్లి పోయిన పదార్థాలు విక్రయిస్తున్న కేఎఫ్సి ఔట్లెట్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కస్టమర్లు డిమాండ్ చేశారు.
Next Story






