గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

by Disha Web Desk 11 |
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
X

దిశ, కీసర: రాంపల్లి దాయర గ్రామంలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు మధుసూదన్ రెడ్డి పొలం సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. ఈ ఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాంపల్లి దాయర గ్రామంలోని సర్వీస్ రోడ్డు పొలాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కనిపించడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story