గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

by Disha Web Desk 11 |
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
X

దిశ, కూకట్​పల్లి: కూకట్ పల్లి పోలీస్​స్టేషన్​ పరిధిలోని మూసాపేట్​ కైత్లాపూర్​ ఆర్ఓబీ కింద ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు సీఐ నరసింగరావు తెలిపారు. స్థానికులు అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులకు ఆర్ఓబీ కింద మెట్ల మార్గం వద్ద ఉన్న ఓ గుంతలో సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి పడి ఉన్నట్లు గమనించారు.

వెంటనే 108 సహాయంతో ఆ వ్యక్తి చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారని పోలీసులు తెలిపారు. మృతుడికి సంబంధించిన ఎటువంటి సమాచారం లభించలేదని సీఐ నరసింగరావు తెలిపారు.

Next Story

Most Viewed