గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..

by Disha Web Desk 11 |
గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం..
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ఐడీఎల్​ చెరువులో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం అయినట్లు సీఐ నరసింగరావు తెలిపారు. ఐడీఎల్​ చెరువులో గుర్తు తెలియని మృతదేహం ఉందని సమాచారం అందడంతో పోలీసులకు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని చెరువులో నుంచి వెలికి తీసి పరిశీలించగా మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని, మృతుడి వయస్సు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని మృతుడికి సంబంధించిన ఎటువంటి వివరాలు లభించలేదని సీఐ తెలిపారు.

Next Story