- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నేర నియంత్రణలో అధికారులు కఠినంగా వ్యవహరించాలి : సీపీ
దిశ,కీసర : నేర నియంత్రణలో అధికారులు కఠినంగా వ్యవహరించాలని రాచకొండ కమిషనర్ తరుణ్ జోషి ఐపీఎస్ అన్నారు. గురువారం కీసర పోలీస్ స్టేషన్ అధికారులతో క్రైమ్ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో కీసర స్టేషన్ పరిధిలో నమోదైన పోక్సో కేసులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు, పెండింగ్ గ్రేవ్ కేసుల విచారణ, ఇతర కేసుల విచారణ పురోగతి మీద సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ.. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే నేరాలను అదుపులో ఉంచాలని, నేర నియంత్రణ కు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదు చేయడానికి వచ్చే బాధితులతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, వారి బాధలను ఓపికగా విని తగిన న్యాయం చేయాలని సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో సిబ్బంది పనితీరు గురించి తెలుసుకున్నారు. వృద్ధులు, మహిళల పట్ల నేరాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు, వారి ఫిర్యాదులకు తక్షణమే స్పందించి సత్వర న్యాయం చేకూర్చాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ మల్కాజిగిరి పద్మజ ఐపిఎస్, ఏసిపి నరేందర్ గౌడ్, సీఐ వెంకటయ్య కీసర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్, అధికారులు పాల్గొన్నారు.