ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు

by Disha Web Desk 12 |
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు
X

దిశ, పేట్‌బషీరాబాద్: ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగటంతో బస్సు పూర్తిగా దగ్ధమైన సంఘటన పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చత్తీస్గడ్ రిజిస్ట్రేషన్‌తో ఉన్న ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు నగరం నుంచి రాయపూర్‌కు 30 మంది ప్రయాణికులతో బయలుదేరింది. కొంపల్లి ఎక్స్ రోడ్డుకి రాగానే బస్సులో నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్ ప్రయాణికులను అప్రమత్తం చెయగా.. అందరూ హుటాహుటిన దిగిపోయారు. అనంతరం ప్రయాణికులు చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది. జీడిమెట్ల ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.


Next Story