ఎన్నికల కోడ్ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు ఎంతో తెలుసా..?

by Disha Web Desk 4 |
ఎన్నికల కోడ్ తర్వాత పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు ఎంతో తెలుసా..?
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల కోడ్ వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక బృందాలు సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే కోడ్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో రూ.202 కోట్ల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ.76.65 కోట్ల నగదు, రూ.43.57 విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. రూ.29.62 కోట్ల విలువైన 118 కిలోల బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు రూ.26.54 కోట్ల విలువైన 13.86 లక్షల వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story