- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గ్రేటర్ పరిదిలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్..
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలో పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు చేరారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో హైదరాబాద్ లోని నందినగర్ లోని స్వగృహంలో సోమవారం బండ్లగూడ కు చెందిన మాజీ మేయర్ మహేందర్ గౌడ్, కౌన్సిలర్లు చేరారు. వారికి కేటీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పార్టీలో పనిచేసే కార్యకర్తలందరికీ గుర్తింపు లభిస్తుందన్నారు. భవిష్యత్ లో అవకాశాలు వస్తాయన్నారు. భవిష్యత్తు అంతా బీఆర్ఎస్ పార్టీదే అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్నారు. పరిపాలనను గాలికి వదిలేసి ప్రధానప్రతిపక్షంపై విమర్శలకే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ తీరును ప్రజల్లో ఎండగట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, నాయకులు ఉన్నారు.