మెదక్ రానున్న యువ ఎమ్మెల్యే రోహిత్..!

by Disha Web Desk 22 |
మెదక్ రానున్న యువ ఎమ్మెల్యే రోహిత్..!
X

దిశ, మెదక్ ప్రతినిధి: యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు తొలిసారి మెదక్‌లో అడుగు పెట్టనున్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తరవాత మెదక్ రావడం ఇదే తొలిసారి. శుక్రవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారికంగా అడుగు పెట్టనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మెదక్ ఎమ్మెల్యేగా మైనంపల్లి రోహిత్ గెలిచిన తరవాత ఎమ్మెల్యేల క్యాంప్‌లో ఉండటం మూలంగా కార్యకర్తలు, అధికారులకు కలవలేదు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డీ సీఎంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో మెదక్ ఎమ్మెల్యే రోహిత్ ఈ నెల 8న అధికారిక పర్యటన చేస్తున్నారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంప్‌లో నూతన ప్రవేశం పూజ 8గంటలకు గోపూజ ప్రవేశంతో ప్రారంభం చేయనున్నారు. గణపతి పూజతో సర్వ మత ప్రార్థనలు నిర్వహిస్తారు. జిల్లా అధికారులతో సమీక్షతో పాటు, నేతలు, కార్యకర్తలను కలవనున్నారు.

జిల్లా అధికారులతో సమీక్ష...

మెదక్ ఎమ్మెల్యేగా గెలిచిన మైనంపల్లి రోహిత్ జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో దృష్టికి వచ్చిన ప్రజా సమస్యల పై సమీక్ష చేయనున్నారు. మొదటి సారి మెదక్‌లో ఎమ్మెల్యే హోదాలో అడుగు పెడుతున్న మైనంపల్లి రోహిత్ రాక కోసం కార్యకర్తలు, నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే కార్యాలయంను ముస్తాబు చేశారు. పింక్ రంగులో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి రంగులు వేసి ముస్తాబు చేశారు.



Next Story

Most Viewed