సూట్కేస్‌తో వస్తే బీఆర్ఎస్‌లో టికెట్

by Disha Web Desk 22 |
సూట్కేస్‌తో వస్తే బీఆర్ఎస్‌లో టికెట్
X

దిశ, నిజాంపేట: తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ టైటానిక్ నావ లాంటిదని ఎప్పుడు మునిగిపోతుందో తెలియని పరిస్థితుల్లో ఉందని మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు బీజేపీ మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో శుక్రవారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సూట్ కేస్ ఎవరు ఇస్తే వారికి టికెట్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. మెదక్ నుంచి ఉద్యమకారులు ఎవరు లేరా అని ప్రశ్నించారు. ఉద్యమకారులను గుర్తించి టికెట్ ఇవ్వరా.... సూట్కేసులో డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టికెట్ ఇస్తారా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో మాత్రమే అధికారంలో ఉంటుందని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంటుందని గెలిచే వారికి బలాన్ని ఇస్తు తోడుగా నిలబడాలన్నారు. ప్రశ్నించే గొంతుకు ప్రాణం పోయాలన్నారు. మెదక్ పార్లమెంట్ అభివృద్ధి కోసం తాను ఎంతగానో దోహదపడుతానన్నారు. ప్రజలంతా ఏకమై ప్రధానిగా మోదీని నిలబెడుదామన్నారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి మెదక్ ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట జడ్పీటీసీ పంజా విజయ్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాస్, రామాయంపేట మండల అధ్యక్షుడు భానుచందర్, నిజాంపేట మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, బీజేపీ నాయకులు ఆకుల రమేష్, సీనియర్ నాయకులు శ్రీనివాస్ గౌడ్, శంకర్ గౌడ్, నరేష్ మహంకాళి, తదితర నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed