- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఇంటర్ రిజల్ట్స్ ఎఫెక్ట్.. మరో విద్యార్థిని ఆత్మహత్య
by Disha Web Desk 9 |
X
దిశ, నర్సింహులపేట: ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో పురుగుల మందు తాగి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నర్సింహులపేట మండలం రూప్లతండ జిపి పరిధిలో గల ఎర్రచక్రు తండాలో చోటుచేసుకుంది. ఎర్రచెక్రు తండాకు చెందిన గుగులోతు బీమాకు ఇద్దరు కుమార్తెలు చిన్న కుమార్తె స్వాతి(17) తొర్రూర్ పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదివింది. ఇటీవల వెలువడిన ఇంటర్ ఫలితాలలో రెండు సబ్జెక్టులు తప్పడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్ కు తరలించారు. చికిత్స అందిస్తున్న క్రమంలోనే స్వాతి మరణించింది. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Next Story