రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

by Disha Web Desk 6 |
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
X

దిశ, మెదక్ ప్రతినిధి/పాపన్నపేట: పాపన్నపేట మండల పరిధిలోని నార్సింగ్ గ్రామ శివారులో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసుల సమాచారం మేరకు రెండు బైకులు ఎదురెదురుగా వస్తు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో నార్సింగ్ గ్రామానికి చెందిన చాకలి రాజు (25) మృతి చెందగా మరో బైక్ పై వెళ్తున్న వ్యక్తి కూడా మృతి చెందాడు. చీకటి కావడంతో అతడి వివరాలు తెలియాల్సి ఉందని పాపన్నపేట ఎస్సై విజయకుమార్ వెల్లడించారు. మరో వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయనున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ వెల్లడించారు .



Next Story