నిలదీసిన వారికి బెదిరింపులు తప్పవా..

by Disha Web Desk 20 |
నిలదీసిన వారికి బెదిరింపులు తప్పవా..
X

దిశ, తూప్రాన్ : అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతుంది. అడ్డుకునే వారిని చంపుతం లారీ ఎక్కిస్తం అంటు బెదిరింపులకు గురి చేస్తున్నారు రియల్ మాఫియా. పూర్తి వివరాల ప్రకారం మనోహరబాద్ మండల పరిధిలోని ముప్పిరెడ్డిప్లలి గ్రామ పరిధిలో గల ఓ ప్రయివేటు పరిశ్రమలో శికం భూమిలో గ్రామానికి చెందిన కొందరు బీఆర్ఎస్ నాయకులు, గ్రామానికి చెందిన వార్డు సభ్యులు కలిసి అక్రమంగా రాత్రి సమయంలో మట్టిని నింపి కుంటను కబ్జా చేశారు. విషయం తెలుసుకున్న ఇరిగేషన్ అధికారులు స్పందించి మట్టిని తవ్విస్తుండగా అక్రమార్కులు అడ్డుగా వచ్చి ఆర్ఐ, ఇరిగేషన్ అధికారులను ఇష్టానుసారంగా దుర్బాషలడారని అధికారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ ఇప్పటికే అక్రమార్కులు చెరువులు, కుంటలను కబ్జాలు చేస్తున్నారని. ప్రభుత్వానికి గండి కొట్టి అక్రమార్కులు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు.

ఇరిగేషన్ అధికారుల వివరణ..

త్వరలో పూర్తిగా విచారణ చేసి కుంటను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదే విధంగా తమపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తుల పై చాట్ట రీత్యా కేసు నమోదు చేస్తామని అన్నారు.



Next Story

Most Viewed