పాఠ‌శాల తాళాలు ప‌గుల‌గొట్టిన ఆక‌తాయిలు

by Ratna Kumari |

వేసవి సెలవులను అదునుగా తీసుకొని గుర్తు తెలియని ఆకతాయిలు ప్రభుత్వ పాఠశాలలో బీభత్సం సృష్టించారు.

పాఠ‌శాల తాళాలు ప‌గుల‌గొట్టిన ఆక‌తాయిలు
X

దిశ‌, రాయికోడ్ : వేసవి సెలవులను అదునుగా తీసుకొని గుర్తు తెలియని ఆకతాయిలు ప్రభుత్వ పాఠశాలలో బీభత్సం సృష్టించారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ మండల కేంద్ర పరిధిలోని పాంపాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం పాఠశాల ఆఫీసు రూమ్ తో పాటు, 10 వ తరగతి గది తాళాన్ని పగులగొట్టారు. తరగతి గదిలో ఉన్న కరెంట్ బోర్డు , 3 ఫ్యాన్లను, బీరువాను ధ్వంసం చేశారు. అలాగే పాఠ్య పుస్తకాలను చిందరబంధర చేశారు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీత, మండల విద్యాధికారి జీ నర్సింహులు కు సమాచారం అందించారు. మంగళవారం మండల విద్యాధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించారు. ఆయన వెంట ఉపాధ్యాయులు విజయ్, బీ శ్రీనివాస్, గ్రామ స‌ర్పంచ్, యువ‌కులున్నారు.

Next Story