దిశ ఎఫెక్ట్ : ఐకేపీ సెంటర్లను ప్రారంభించిన అధికారులు

by Taduka Kalyani |

ఇటీవల దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు దౌల్తాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఐకెపి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

దిశ ఎఫెక్ట్ : ఐకేపీ సెంటర్లను ప్రారంభించిన అధికారులు
X

దిశ, దౌల్తాబాద్: ఇటీవల దిశ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు దౌల్తాబాద్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఐకెపి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కనకయ్య, వైస్ చైర్మన్ స్వామి, డైరెక్టర్లు, సంబంధిత అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు ప్రక్రియను సజావుగా కొనసాగించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. రైతులు తమ ధాన్యాన్ని నిరభ్యంతరంగా సెంటర్లకు తీసుకురావాలని సూచించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి గింజను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story