పెద్ద చెరువు సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలి : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌

by Disha Web Desk 1 |
పెద్ద చెరువు సుందరీకరణ పనుల్లో వేగం పెంచాలి : ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌
X

దిశ, అందోల్‌: పెద్ద చెరువు కట్ట సుందరీకరణ పనుల్లో మరింత వేగం పెంచాలని ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌ అన్నారు. ఆదివారం చెరువు కట్ట సుందరీకరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చెరువు కట్ట పనుల కోసం రూ.2.55 కోట్లను మంజూరు చేసిందన్నారు. పనులను నాణ్యతగా చేపట్టాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ నిధులతో కట్టపై వాకింగ్‌ ట్రాక్, మురికి కాలువల నిర్మాణంతో పాటు ఇతరత్రా పనులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం చేపడుతున్న మొరం పనులను రెండు, మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ పనులను అధికారులు దగ్గరుండి పర్యవేక్షించి, నాణ్యతగా జరిపించాలన్నారు. ఆయన వెంట మున్సిపల్‌ ఇన్ చార్జి ఏఈ విఠోబా, మాజీ మార్కెట్‌ చైర్మన్‌ పి.నారాయణ, కాంట్రాక్టర్‌ నాగిరెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేశం, వర్క్‌ ఇన్స్పెక్టర్ మహేందర్‌, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed