నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి

by Disha Web Desk 1 |
నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
X

దిశ, కొండపాక: నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో దేశంలో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత షిండే, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, ఇరిగేషన్ అధికారులు, బాన్సువాడ ప్రజా ప్రతినిధులతో కలిసి తిప్పారం శివారులోని మల్లన్న సాగర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా మల్లన్న సాగర్ కట్ట వద్ద విలేకరులతో వారు మాట్లాడుతూ రైతుల కష్టాలు తీర్చిన కనబడే దేవుడు కేసీఆర్ అని అన్నారు.

భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వృథాగా వెళుతున్న నీటిని వినియోగంలోకి తీసుకురావాడం కోసం కాలేశ్వరం ప్రాజెక్టును రూపకల్పన చేసి పట్టుదలతో సాధించి ప్రజల అవసరాలు తీర్చిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. సుమారు 1,700 క్యూసెక్కుల సముద్రంలో కలిసే నీటిని ప్రజల అవసరాల కోసం ఎన్నో ఇబ్బందులను అధిగమించి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాడన్నారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ ప్రాజెక్టుల ద్వారా అనంతసాగర్ రంగనాయక సాగర్ రిజర్వాయర్ల నుంచి అతి పెద్దగా 50 టీఎంసీల సామర్థ్యం తో నిర్మించిన మల్లన్న సాగర్ లోకి గోదావరి నీటిని గొప్ప విషయమన్నారు.

మల్లన్న సాగర్ ప్రాజెక్టు ద్వారా సుమారు 50లక్షల ఎకరాలకు ప్రత్యక్ష పరోక్ష సాగునీరు అందుతుందన్నారు. 31 నియోజకవర్గాలు, 13 జిల్లాల్లో రెండు పంటలకు నీరు అందుతుందన్నారు. ఇదంతా సీఎం సంకల్పం ఆయన కృషి పట్టుదల ఇంజనీర్ల శ్రమతో రిజర్వాయర్ ఏర్పాటయిందన్నారు. ఎంతో మంది భూములు కోల్పోయిన వారికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మల్లన్న సాగర్ నుంచి నిజాంసాగర్ గోదావరి జలాలను అందించే కాలువలను పరిశీలించినట్లు తెలిపారు.

నిజాం సాగర్ కు వచ్చే నీటి ద్వారా నర్సాపూర్, కౌడిపల్లి జుక్కల్ బోధన్ బాన్సువాడ నియోజకవర్గంగ్రామాలకు రెండు పంటలకు సాగునీరు అందుతుందన్నారు. రాష్ట్రంలో సుమారు 150 నుంచి 200 టీఎంసీల నీరు ఉండే రిజర్వాయర్లు ఉన్నాయని ఒక సంవత్సరం వర్షం పడకున్నా రిజర్వాయర్ల ద్వారా పంటలు వేయవచ్చన్నారు. ఎన్ని ఆటంకాలు పెట్టినా ఎన్ని ఇబ్బందుల గురి చేసినా అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అన్నింటికీ మూలం నీరు అని మీరు సమృద్ధిగా ఉంటే రాష్ట్రం దేశం సంపదలతో తులతూగుతుందని అన్నారు.

దేశంలో వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని వినియోగంలోకి తీసుకువస్తే దేశం సస్యశ్యామలమవుతుందన్నారు. మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ కు వెళ్లే కాలువకు కేసీఆర్ ఒకటి, మల్లన్న సాగర్ నుంచి నిజాంసాగర్ కు వెళ్లే కాల్వకు కేసీఆర్ రెండో కాలువగా ఆయన నామకరణం చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ లో మిగతా పనులను తొందరగా చేయాలని అధికారులకు ఆదేశించారు.

స్పీకర్ కు స్వాగతం పలికిన పలువురు నాయకులు

మల్లన్న సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన పోచారం శ్రీనివాస్ రెడ్డికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర ఎఫ్.డీ.సీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, రైతుబంధు సమితి స్టేట్ కౌన్సిల్ సభ్యుడు దేవి రవీందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అమరేంద, పీఎన్ఆర్ సంస్థ చైర్మన్ పోల్కంపల్లి నరేందర్, సర్పంచ్ లు మహిపాల్ కిరణ్ కుమార్, ఐలయ్య తదితరులు ఉన్నారు. మల్లన్న సాగర్ ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన స్పీకర్ పోచం శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు గౌరవ వందనం చేశారు.



Next Story

Most Viewed