రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం

by Disha Web Desk 1 |
రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
X

దిశ, అందోల్‌: డివైడర్‌ను ఢీకొని విద్యార్థి మృతి చెందిన ఘటన జోగిపేట పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జోగిపేటకు చెందిన ఫయాజ్‌ అలీ (14) స్థానిక ఆక్స్‌ఫర్డ్‌ స్కూల్‌ 8వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో తన స్నేహితుడు ఫయాజ్‌ అలీతో మరో విద్యార్థి అందోలు నుంచి బైక్ పై జోగిపేటకు వస్తున్నారు. ఫైర్‌ స్టేషన్‌ మూల మలుపు వద్ద వాహనం కంట్రోల్‌ కాకపోవడంతో నేరుగా డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో ఫయాజ్‌ అలీ తలకు తీవ్రగాలయ్యాయి. వెనుకాలే ఉన్న విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు ఇద్దరిని ముందుగా జోగిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ పరిస్థితి విషమించడంతో వెంటనే అంబులెన్స్ లో సంగారెడ్డి ప్రభుత్వాసుసుపత్రికి తరలించారు. ఫయాజ్ అలీని పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లుగా ధృవీకరించారు.

Next Story

Most Viewed