కన్నుల పండుగగా తెప్పోస్థవం

by Dishanational2 |
కన్నుల పండుగగా తెప్పోస్థవం
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ మహాలక్ష్మీ గోదా సమేత విరాట్ వేంకటేశ్వర స్వామి దివ్యక్షేత్రం (శ్రీ వైకుంఠపురం) లో శ్రీవారి నవమ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ప్రత్యక్ష పర్యవేక్షణలో, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరుగుతున్నాయి. మంగళవారం రాత్రి 7 గంటల నుంచి శ్రీవారి పుష్కరిణిలో దేవనాథ రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో భూ వరాహమూర్తిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వైకుంఠనాథుడి తెప్పోస్థవం కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఆనంతరం గజవాహన సేవ, బాలిహరణం కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, జై శ్రీమన్నారాయణ చారిటబుల్ ట్రస్టు సభ్యులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed