- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెండింగ్ కేసుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి..
మెదక్ జిల్లాలో నమోదవుతున్న వివిధ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు.

దిశ, మెదక్ టౌన్ : మెదక్ జిల్లాలో నమోదవుతున్న వివిధ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పోలీసు అధికారులను ఆదేశించారు. మెదక్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో గురువారం నిర్వహించిన మంత్లీ క్రైమ్ రివ్యూ సమావేశంలో ఆయన జిల్లా వ్యాప్తంగా నమోదైన నేరాలు, వాటి దర్యాప్తు పురోగతి, మిస్సింగ్ కేసులు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులు, గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, సైబర్ నేరాలు, ట్రాఫిక్ అమలు చర్యలు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మిస్సింగ్ కేసుల దర్యాప్తును అత్యంత ప్రాధాన్యంతో చేపట్టి, అదృశ్యమైన వారి ఆచూకీ త్వరితగతిన గుర్తించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎస్సీ/ఎస్టీ కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యానికి తావు లేకుండా చట్టపరమైన గడువుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని ఆదేశించారు. గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసుల దర్యాప్తు పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పెండింగ్ కేసుల సంఖ్యను తగ్గించాలని పేర్కొన్నారు. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ డేటాను తప్పనిసరిగా నవీకరించాలని, మాన్యువల్ రికార్డులు, సీసీటీఎన్ఎస్ నమోదుల మధ్య ఉన్న వ్యత్యాసాలను వెంటనే సరిచేయాలని సూచించారు.






