బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

by Ratna Kumari |

దిశ, ములుగు : మర్కుక్ మండల ప‌రిధిలోని పాములపర్తి గ్రామానికి చెందిన పిట్ల బిక్షపతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మండల బీఆర్‌ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
X

దిశ, ములుగు : మర్కుక్ మండల ప‌రిధిలోని పాములపర్తి గ్రామానికి చెందిన పిట్ల బిక్షపతి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మండల బీఆర్‌ఎస్ బీసీ సెల్ అధ్యక్షుడు మేకల కనకయ్య మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, అన్ని విధాలుగా తమ సహయ సహకారం అందిస్తానని తెలిపారు. అదేవిధంగా మండల కేంద్రం ములుగు కు చెందిన గంగలమైన ఎల్లం, పొట్టి చంద్రమ్మలు అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న తిగుళ్ల కుమార్ బాయ్ తో కుటుంబానికి ఒక్కొక్కరికి రూ. 10వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కోఆప్షన్ సభ్యులు సలీం, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీనివాస్, వాజిద్ భాషా, కృష్ణారెడ్డి, కడపల నరసింహారెడ్డి, రాములు, రవి, పాల్గొన్నారు.

Next Story