కుక్కల దాడిలో తొమ్మిది గొర్రెలు హతం

by Disha Web Desk 1 |
కుక్కల దాడిలో తొమ్మిది గొర్రెలు హతం
X

దిశ, ఖానాపూర్: ఖానాపూర్ మండల పరిధిలోని నడింపల్లెకు చెందిన దాసరి పోషమల్లుకు చెందిన గొర్రెల పాకలోకి కుక్కలు చొరబడి దాడి చేయగా తొమ్మిది గొర్రెలు మృతి చెందాయి. మిగితా గొర్రెలు గాయపడ్డాయి. దీంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. మండల కేంద్రం, సుర్జాపూర్, ఎర్వచింతల్, భీరనంది గ్రామాల్లో ప్రజలు, పశువులపై ఇటీవల ఊరు కుక్కల దాడులు ఎక్కువయ్యయి. కడం మండలంలోని అంబర్ పేట్ గ్రామంలో ఊరు కుక్కలు దాడిలో పది గొర్రెలు మృతి చెందాయి. ఇంత జరుగుతున్నా ప్రజా ప్రతినిధులు, అధికారులు మాత్రం ఏమాత్రం పట్టింపు లేకుండా వ్యవహరిస్తురని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నష్ట పరిహారం చెల్లించాలని ధర్నా..

ఊరు కుక్కల దాడిలో మృతి చెందిన గొర్రెల యజమాని దాసరి పోశామల్లుకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని గ్రామంలోని చౌరస్తాలో ధర్నా చేపట్టారు. ఘటన స్పందించి అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకొని కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed