నిజాయితీగా ఓటు వేయండి

by Bhanu |

ఎన్నికల సమయంలోనే జనంలోకి వచ్చి డబ్బులు పంచేటోల్లకు ఓట్లు వేయొద్దని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు

నిజాయితీగా ఓటు వేయండి
X

దిశ, మిరుదొడ్డి: ఎన్నికల సమయంలోనే జనంలోకి వచ్చి డబ్బులు పంచేటోల్లకు ఓట్లు వేయొద్దని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో భాగంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థి కానుగంటి స్వప్న శ్రీనివాస్ కు మద్దతుగా ప్రచార నిర్వహించారు. అనంతరం వారు. మాట్లాడుతూ గల్లీలో ఢిల్లీలో లేని పార్టీలకు ఓట్లు వేయొద్దని ఓటర్లకు సూచించారు. ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా డబ్బులు ఆశించకుండా జనం మధ్యలో ఉండే మంచి నాయకున్ని ఎన్నుకోవాలని అన్నారు. సర్పంచ్ ఎన్నికలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని వారు కోరారు.

Next Story