ఆర్టీసీ బస్ ఫ్రీ టికెట్ పై మహిళలతో మాట్లాడిన జగ్గారెడ్డి

by Disha Web Desk 22 |
ఆర్టీసీ బస్ ఫ్రీ టికెట్ పై మహిళలతో మాట్లాడిన జగ్గారెడ్డి
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి మాట ఇచ్చిన్నట్లే మాట నిలబెట్టుకున్నారని జగ్గారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆర్టీసీ బస్ ఎక్కి మహిళలు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు, ఇస్నాపూర్ నుంచి రుద్రారం వరకు ఆర్టీసీ బస్ ఎక్కి జగ్గారెడ్డి ప్రయాణం చేశారు. ఫ్రీ టికెట్ పై మహిళల అభిప్రాయం అడిగి తెలుసుకున్నారు. టికెట్ లేకుండా ప్రయాణం పై మహిళలు హర్షం వ్యక్తం చేశారు. చాలా ఆనందంగా ఉందని జగ్గారెడ్డితో అన్నారు. కండక్టర్‌తో రోజు అలా ట్రిప్‌కి ఎంత మంది మహిళలు జర్నీ చేస్తారని జగ్గారెడ్డి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకుంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీని మీరు జీవితంలో మరువద్దని అన్నారు. ఇంకా మహిళల కోసం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ ఎన్నికల్లో చెప్పిన్నట్లే అన్ని పథకాలు అమలు చేస్తారని భరోసా ఇచ్చారు. గృహిణి మహిళలకు కూడా త్వరలో రూ. 2,500 కాంగ్రెస్ పార్టీ ఇస్తుందన్నారు. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారెంటీలు అమలు చేస్తారని అన్నారు.



Next Story

Most Viewed