నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Disha Web Desk 1 |
నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే : ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, మిరుదొడ్డి : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా తీవ్రంగా పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మండల వ్యవసాయ అధికారి మల్లేశం, తహసీల్దార్ ఉదయశ్రీ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు తక్షణమే నష్ట పరిహారం కింద ఎకరానికి రూ.20వేల చొప్పున చెల్లించాలని అన్నారు. అలాగే రైతు రుణమాఫీ కూడా చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా వానా కాలానికి పెట్టుబడి సాయం కింద మరో రూ.10 వేలు రైతులకు అందజేయాలన్నారు.

Next Story

Most Viewed